October 22, 2024
Police (2)
Police (2)

Police: మహిళ పై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు

Police: మెట్ పల్లి, ఆగస్టు 09 (ప్రజా శంఖారావం): మెట్ పల్లి పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు కుటుంబ సమస్యలతో వచ్చిన భార్యాభర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్ ఆవరణలో గొడవపడ్డారు. ఇది గమనించిన ఏఎస్ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ అశోక్ లు సదరు మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ భార్యాభర్తల గొడవను సర్దుమనిపించే క్రమంలో మహిళపై పోలీసులు లాఠీతో కొట్టడం పలు విమర్శలకు తావిస్తోంది.

పోలీస్ స్టేషన్ ఆవరణలో జరుగుతున్న ఈ తథంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి, మహిళ అని చూడకుండా లాఠీతో కొట్టిన పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఘటనకు సంబంధించిన గొడవ పై ఉన్నతాధికారులు విచారణ చేసి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!