October 22, 2024

Nizamabad: మనుషుల మధ్య మటన్ కర్రీ చిచ్చు 

Nizamabad: నిజామాబాద్ జిల్లా, ఆగస్టు 29 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో మటన్ కర్రీ మనుషుల మధ్య చిచ్చు పెట్టింది. మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మటన్ కర్రీ కోసం గొడవపడిన ఘటనలో 19 మంది పై పోలీస్ కేసు నమోదు అయ్యేలా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. వివరాల్లోకి వెళ్తే పెళ్లి కొడుకు తరపు వారికి వివాహ వేడుక భోజన సమయంలో మాంసం తక్కువగా వడ్డించారని చిన్నపాటి వాదన మొదలైంది. ఈ వాదన కాస్త ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి మాంసం కోసం తలలు పట్టుకునే పగుల గొట్టుకునే స్థాయిలో గొడవ పడడంతో వివాహ వేడుక కాస్త రణ రంగా రంగా మారింది. వివాహ వేడుకలో గొడవ పడి తలలు పగలగొట్టుకున్న 19 మంది పై పోలీసు కేసు నమోదు అవడంతో సుబ్బిగాడి పెళ్లి చావుకి వచ్చినట్లు వుంది అన్న చందంగా శుభకార్యానికి వెళ్లి పోలీస్ కేసు నమోదు చేయించుకున్నట్లయింది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!