October 22, 2024
Market Commite
Market Commite

Market commite: ఫ్లాష్.. ఫ్లాష్.. మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకం

Market commite: హైదరాబాద్, ఆగస్టు 13 (ప్రజా శంఖారావం): రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంగళవారం కొత్తగా 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన చైర్మన్ వైస్ చైర్మన్ లతో పాటు పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ఇబ్రహీంపట్నం, నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమించారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ లుగా పన్నాల అంజయ్య, బురిగం రాజులను నియమించగా, వైస్ చైర్మన్ లుగా పుల్లూరి అంజయ్య, వెంకటరెడ్డి వెంకట అప్పారెడ్డి లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అంకుసంధ్య, వైస్ చైర్మన్ గా శంకర్లతోపాటు పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మిగతా మార్కెట్ కమిటీల పాలకవర్గాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!