Wednesday, 12 March 2025, 19:26
Pension
Pension

Pension: కొత్త రూల్స్ అమలులోకి…వాళ్లకు ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలి.. లేకపోతే వచ్చే నెల నుంచి పెన్షన్ రాదు

Pension: ప్రభుత్వం పెన్షన్ తీసుకునే వాళ్ళకి బిగ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా దివ్యాంగులకు ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. కరీంనగర్ సర్ఫ్ దివ్యరాజ్ దివ్యాంగులకు యూ డి ఐ డి నెంబర్ జనరేట్ చేయాలని సూచించారు. సోమవారం నాడు సదరు సర్టిఫికెట్ల నుంచి యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ చేయాలని తెలిపారు. కరీంనగర్లో ఉన్న దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ బదులు యూనిట్ డిసేబులిటీ ఐడి జారీ చేయాలని అలాగే సదరం సర్టిఫికెట్ నుంచి ఈ కార్డు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి అని ఆయన తెలిపారు. యూ డి ఐ డి పోర్టల్ లో వైద్యులచే దివ్యాంగులకు ధ్రువీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్ను నమోదు చేయాలని తెలిపారు.

అలాగే దివ్యాంగులకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని అన్నారు. యూ డి ఐ డి కార్డు పోస్టు ద్వారా దివ్యాంగులకు నేరుగా ఇంటి అడ్రస్ కు అందుతుందని చెప్పుకొచ్చారు. యూ డి ఐ డి కార్డులు అందులకు, విజన్, కుష్టి వ్యాధిగ్రస్తులకు, వినికిడి సమస్య కలవారికి, అంగన్ వైకల్యం గల వారికి, మానసిక వైకల్యం ఉన్నవారికి వైకల్య శాతాన్ని పరిశీలించి జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే యూ డి ఐ డి కార్డుల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్లకి యూ డి ఐ డి కార్డు జనరేట్ చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. దివ్యాంగులకు ఫిబ్రవరి 28, 2025 వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లతో పెన్షన్ మరియు ఇతర సదుపాయాలు మన రాష్ట్రంలో పొందవచ్చని అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూ డి ఐ డి కార్డు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. దివ్యాంగులకు మార్చి 1వ తేదీ నుంచి యు డి ఐ డి కార్డు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. యు డి ఐ డి కార్డు ద్వారానే పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *