October 22, 2024
Agitation in front of ACP office
Agitation in front of ACP office

Agitation in front of ACP office: ఏసీపి కార్యాలయం ఎదుట ఆందోళన

Agitation in front of ACP office: ఆర్మూర్ టౌన్, అక్టోబర్ 14 (ప్రజా శంకరావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఏసిపి కార్యాలయం ఎదుట త్రిపుర దుర్గామాత మండపం నిర్వాహకులు సోమవారం ఆందోళన నిర్వహించారు. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటుచేసిన డీజే సౌండ్ బాక్స్లను పోలీసులు తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో ఉంచడంతో నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నిర్వాహకులు నినాదాలు చేశారు.

నిర్వహకులకు ఆర్మూర్ బిజెపి, బీజేవైఎం పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు. అధిక సౌండ్ కలిగిన డీజే సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేయరాదని నిర్వాహకులకు ముందే హెచ్చరించిన పరిమితికి నుంచి డిజె సౌండ్ సిస్టం బాక్సులను ఏర్పాటు చేసినందునే డీజే బాక్సులను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

ఈ నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించాలని హెచ్చరిస్తూ డీజే సౌండ్ బాక్స్లను తిరిగి నిర్వాహకులకు పోలీసులు అప్పజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. త్రిపుర దేవీ నవరాత్రి మండపం నిర్వాహకులతో పాటు బిజెపి నాయకులు కలిగోట గంగాధర్, మందుల బాలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!