Father committed suicide: కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 13 (ప్రజా శంఖ రావం): కామారెడ్డి జిల్లాలో దసరా పండగ వేళ తీవ్ర విషాధం చోటు చేసుకుంది. ఒక తండ్రి క్షణికవేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు పిల్లలప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పండగ పూట కొత్త బట్టలు ధరించి సరదాగా గడపాలని ఆశించిన చిన్నారుల ప్రాణాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ ఘటన తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టపు శ్రీనివాస్ పండగ రోజు పిల్లలతో విగ్నేష్ (07), అనిరుద్ (05)లతో కలిసి సరదాగా బయటకి వెళ్లారు.
గ్రామ శివారులోని ఓ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల తండ్రికి సంబంధించిన ఫోన్, చెప్పులు బావి గట్టున ఉండటంతో అతను కూడా చనిపోయి ఉంటాడని భావిస్తూ గ్రామస్తులు బావిలో గాలింపు చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. పండగ పూట చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.